నిస్వార్ధంగా సేవలు అందించేవారు పాత్రికేయులు: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-11-16T21:00:42+05:30 IST

నిస్వార్ధంగా పనిచేస్తూ, సామాజిక అంశాలపై కూడా బాధ్యతతో వ్యవహరించే వారు పాత్రికేయులని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు.

నిస్వార్ధంగా సేవలు అందించేవారు పాత్రికేయులు: ఎర్రబెల్లి

హైదరాబాద్: నిస్వార్ధంగా పనిచేస్తూ, సామాజిక అంశాలపై కూడా బాధ్యతతో వ్యవహరించే వారు పాత్రికేయులని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పాత్రికేయులకు మంత్రి  శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తిచూపి స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోరే పాత్రికేయుల కృషి గణనీయమైనది అని ఆయన అన్నారు.పత్రికలలో చదివే వార్త కూడా మరెవరో వ్రాసింది కావచ్చు కానీ ఆ పాత్రికేయులు వ్రాసిన  వార్త చదువుతుండగా సొంత విశ్లేషణ మనసులో మొదలు పెట్టుకుని అవకాశం పాఠకునికి ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-11-16T21:00:42+05:30 IST