సంజయ్ మాటలకు విలువ లేదు: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2021-11-24T22:06:05+05:30 IST
ధాన్యం సేకరణ విషయంలో తకరారు చేస్తున్న తొండి సంజయ్ మాటలకు
హన్మకొండ: ధాన్యం సేకరణ విషయంలో తకరారు చేస్తున్న తొండి సంజయ్ మాటలకు విలువ లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతు సమస్యలపై ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్కు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై బీజేపీ, కాంగ్రెస్లు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాయని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఫకీరు వేషాలు మానుకోవాలని ఆయన సూచించారు.