57 ఏళ్లు నిండిన వారికి త్వరలో పింఛన్లు

ABN , First Publish Date - 2021-01-18T08:53:59+05:30 IST

రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ త్వరలోనే పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు

57 ఏళ్లు నిండిన వారికి త్వరలో పింఛన్లు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


పాలకుర్తి, జనవరి 17: రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ త్వరలోనే పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఆదివారం నిర్వహించిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అభివృద్ధి పనులకు ఆటంకంగా కలగకుండా ప్రభు త్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఆయన అన్నారు.

Updated Date - 2021-01-18T08:53:59+05:30 IST