వారు పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలి: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-03-21T17:02:50+05:30 IST

బీజేపీ, కాంగ్రెస్ నేతలు పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలని.. మానుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

వారు పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలి: ఎర్రబెల్లి

వరంగల్: బీజేపీ, కాంగ్రెస్ నేతలు పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలని.. మానుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మద్దతు ఉంది కాబట్టే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో గెలిచామన్నారు. బీజేపీని ప్రజలు నమ్మలేదు కాబట్టే కౌన్సిల్‌లో స్థానం లేకుండా పోయిందని చెప్పారు. టీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై దాడులు చేయించి లబ్ధి పొందాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ప్రజలు గుర్తించారన్నారు. ఇప్పటికైనా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. 

Updated Date - 2021-03-21T17:02:50+05:30 IST