జనగామ టీఆర్ఎస్ కార్యాలయం వద్దనే సీఎం సభ

ABN , First Publish Date - 2021-12-17T21:55:45+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 20వ తేదీన జనగామజిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సభను కొత్తగా నిర్మించిన జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్దనే నిర్వహించాలని పార్టీ నాయకులు నిర్ణయించారు

జనగామ టీఆర్ఎస్ కార్యాలయం వద్దనే సీఎం సభ

జనగామ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 20వ తేదీన జనగామజిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సభను కొత్తగా నిర్మించిన జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్దనే నిర్వహించాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. ఈమేరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు పసునూరి దయాకర్, కవిత,ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి,పల్లా రాజేశ్వరరెడ్డి, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు యాదగిరి రెడ్డి, తాటి కొండ రాజయ్య తదితరులు టీఆర్ఎస్ నూతన కార్యాలయం వద్ద ఉన్న స్థలాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. 


ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశాన్ని ఇక్కడే నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందని పార్టీనాయకులు భావిస్తున్నారు. సీఎం పాల్గొనే ఈ సభను ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేసే విజయవంతం చేయాలని, సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రులు కోరారు. అలాగే పార్కింగ్ స్థలాల్లో వాహనాలను నిలిపేలా పక్కా ప్లాన్ చేయాలని, సభ అలంకరణ, వసతుల కల్పన అంశాలపై చర్చించి, ఆయా నాయకులకు బాధ్యతలు అప్పగించారు.

Updated Date - 2021-12-17T21:55:45+05:30 IST