ఈటల నిర్లక్ష్యంతోనే ఇళ్లు రాలేదు: మంత్రి గంగుల

ABN , First Publish Date - 2021-07-10T00:51:10+05:30 IST

బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజుందర్‌పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి

ఈటల నిర్లక్ష్యంతోనే ఇళ్లు రాలేదు: మంత్రి గంగుల

కరీంనగర్: బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజుందర్‌పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు. మంత్రిగా ఉండి కూడా ఈటల నిర్లక్ష్యంతోనే హుజురాబాద్‌ నియోజక వర్గంలో నిరుపేదలకు ఇళ్లు అందుబాటులోకి రాలేదని మంత్రి ఆరోపించారు. మంత్రుల నియోజకవర్గాల్లో 70 శాతం ఇళ్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. వచ్చే ఆగస్ట్‌ 15 వరకు  హుజురాబాద్‌లోని 500 డబుల్‌ బెడ్‌రూమ్‌లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈటల అభివృద్ధి చేయలేదు కాబట్టే తాము అభివృద్ధి చేస్తామని మంత్రి  కమలాకర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-10T00:51:10+05:30 IST