విద్యార్థికి నాలుగు తగిలించండి: మంత్రి గంగుల
ABN , First Publish Date - 2021-07-10T01:37:46+05:30 IST
నగరంలోని కళాభారతి స్థల పరిశీలనకు మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్: నగరంలోని కళాభారతి స్థల పరిశీలనకు మంత్రి గంగుల కమలాకర్ వెళ్లారు. ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో స్థలాన్ని మంత్రి గంగుల పరిశీలించారు. ఇది కాలేజీ స్థలమని, ఇక్కడ ఏమీ కట్టొద్దని గంగులతో విద్యార్థి వాగ్వాదానికి దిగాడు. దీంతో కలెక్టర్, నగర మేయర్ జోక్యం చేసుకున్నారు. ఇది ప్రభుత్వ స్థలమని, తెలియకపోతే తెలుసుకోవాలని విద్యార్థికి గంగుల సూచించారు. విద్యార్థికి నాలుగు తగిలించండి అంటూ అక్కడే ఉన్న పోలీసులను గంగుల ఆదేశించారు.