పట్టాభి ఓ గొట్టంగాడు: Minister Jayaram

ABN , First Publish Date - 2021-10-21T19:39:47+05:30 IST

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిపై కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

పట్టాభి ఓ గొట్టంగాడు: Minister Jayaram

కర్నూలు: టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిపై కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆలూరులో జనాగ్రహ దీక్షలో పాల్గొన్న మంత్రి జయరాం... పట్టాభి ఓ గొట్టంగాడని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ కులంలో పుట్టిన పట్టాభి నీచమైన మాటలు మాట్లాడుతున్నారన్నారు. పట్టాభి మీడియాలో సీఎం విమర్శించారని.. అదే బయట అయ్యుంటే ఆడవాళ్లే ముక్కలు ముక్కలు చేసేవారని తెలిపారు.  సీఎం జగన్‌ను విమర్శిస్తే టీడీపీని భూ స్థాపితం చేస్తామని మంత్రి గుమ్మనూరు జయరాం హెచ్చరించారు. 

Updated Date - 2021-10-21T19:39:47+05:30 IST