కరోనా విజేతలు ప్లాస్మా దానం చేయాలి: హరీశ్
ABN , First Publish Date - 2020-08-15T09:25:12+05:30 IST
కరోనాను జయించిన వ్యక్తులు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని, దీనిద్వారా కొవిడ్ బారిన పడిన వారి ..
సిద్దిపేట టౌన్, ఆగస్టు 14: కరోనాను జయించిన వ్యక్తులు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని, దీనిద్వారా కొవిడ్ బారిన పడిన వారి ప్రాణాలను కాపాడవచ్చని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట శివారు ఎన్సాన్పల్లి గ్రామ శివారులోని మెడికల్ కళాశాలలో కొవిడ్ టెస్టింగ్ (ఆర్టీపీసీఆర్) ల్యాబ్, పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం ఆవరణలో కరోనా మోబైల్ టెస్టింగ్ బస్సును ప్రారంభించిన సందర్భంగా హరీశ్ మాట్లాడారు.