పంజాబ్ కు ఒక నీతి....తెలంగాణకు ఒక నీతా?: హరీశ్ రావు

ABN , First Publish Date - 2021-11-20T00:00:07+05:30 IST

ధాన్యంకొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.

పంజాబ్ కు ఒక నీతి....తెలంగాణకు ఒక నీతా?: హరీశ్ రావు

సిద్దిపేట జిల్లా: ధాన్యంకొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. శుక్రవారం సిద్ధి పేట జిల్లా చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ గ్రామంలో ఐకెపి సెంటర్ ను సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రి  హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రంను యాసంగి పంట కొంటారా?కొనరా? అపి అడుగుతున్నాం.... సీదా అడుగుతున్నామని చెప్పారు.కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడుదామని అన్నారు. 


పంజాబ్ రాష్ట్రానికి ఒక నీతి.. తెలంగాణ రాష్ట్రానికి ఒక నీతా...అంటూ మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతు చట్టాలు రద్దు చేయడం అంటే ఇది రైతుల విజయంగా ఆయన అభివర్ణించారు. రైతుల పోరాటం తో కేంద్రం దిగొచ్చిందని అన్నారు.తెలంగాణ రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. రైతులు ఆందోళన పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వానా కాలం వరి పంట తెలంగాణ ప్రభుత్వం కొంటుంది. వడ్లు కొనేందుకే ఊరు ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాని తెలిపారు. 

Updated Date - 2021-11-20T00:00:07+05:30 IST