ఈటలకు శ్రద్ధ లేదు: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-08-12T21:49:14+05:30 IST

కరీంనగర్: సిద్ధిపేటలో తాను ఇళ్లన్నీ పూర్తి చేయించానని.. ఈటల తన నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్.. నాలుగు వేల ఇళ్లు మంజూరు చేశారని,

ఈటలకు శ్రద్ధ లేదు: హరీష్‌రావు

కరీంనగర్: సిద్ధిపేటలో తాను ఇళ్లన్నీ పూర్తి చేయించానని.. ఈటల తన నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్.. నాలుగు వేల ఇళ్లు మంజూరు చేశారని, అయితే ఈటల ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. బీజేపీ రెండు వేల పింఛన్లు ఎక్కడ ఇస్తుందో చెప్పాలన్నారు. గతంలో ఎమ్మెల్యేలు అంతా కలిసి మహిళా భవనం కట్టించారని చెబుతున్నారని.. అలా అయితే హుజూరాబాద్‌లో ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే ఎలా బతుకుతారు, మీకు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది.. అని గతంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని తెలిపారు. అలాగే కల్యాణ లక్ష్మి, రైతు బంధు పథకాలు దండగ అని ఈటల రాజేందర్ అన్నారని గుర్తు చేశారు. వ్యక్తి ఆత్మగౌరవాన్ని.. ప్రజల ఆత్మ గౌరవంతో ముడిపెడితే కుదరదని హితవు పలికారు. 

Updated Date - 2021-08-12T21:49:14+05:30 IST