పేదలకు నాణ్యమైన వైద్యం: హరీశ్ రావు
ABN , First Publish Date - 2021-12-23T22:23:26+05:30 IST
రాష్ట్రంలోని పేదలకు నాణ్యమైన వైద్యం అందిచడమే తమ ప్రభుత్వ
హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలకు నాణ్యమైన వైద్యం అందిచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. నగరంలోని దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రిలో ఐసీయూ భవనం, నూతన ఆపరేషన్ థియేటర్స్ని హరీష్ రావు ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ వారి సహకారంతో వీటిని నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గాబాయ్ దేశ్ముఖ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనన్నారు. మహిళల విద్య కోసం ఆమె ఎంతో కృషి చేశారన్నారు. ఆమె ఆశయాలను అందరం కలిసి ముందుకు తీసుకొని పోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య శ్రీ నిధుల విడుదలలో ఆలస్యం లేకుండా చర్యలు తీకుంటున్నామన్నారు. ఇంకా తొందరగా విడుదల అయ్యేటట్టు చూస్తున్నామన్నారు.
6 నెలల క్రితం ఆక్సిజన్ దొరుకక ఇబ్బంది కలిగినప్పుడు మేఘా కృష్ణారెడ్డి గారికి చెప్తే క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఆసుపత్రికి ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపు నుంచి అందిస్తామని ఆయన పేర్కొన్నారు.