బీజేపీతో పేదల బతుకులు పిప్పి: హరీష్ రావు

ABN , First Publish Date - 2022-01-23T02:14:00+05:30 IST

ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా పేదల బతుకులు

బీజేపీతో పేదల బతుకులు పిప్పి: హరీష్ రావు

సిద్దిపేట: ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా పేదల బతుకులు పిప్పి అవుతున్నాయని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.  జిల్లాలోని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ షాదీ ముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ పేద ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న పార్టీ బీజేపీ అని ఆయన ఆరోపించారు. అన్నం పెట్టిన చేయ్యేదో, సున్నం పెట్టే చేయి ఏదో ప్రజలకు తెలియాలని ఆయన పేర్కొన్నారు. సిలిండర్ ధర తగ్గించండి అంటే.. దేశం కోసం, ధర్మం కోసం, ధరలు పెంచాం అంటారని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పేదింటి ఆడపడుచు పెళ్లికి కులం మతం అనేది లేకుండా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో  ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎఫ్‌డీసీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మెన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మెన్ రాజమౌళి గుప్త, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T02:14:00+05:30 IST