అమ్మకానికి పెట్టింది పేరు బీజేపీ: హరీష్రావు
ABN , First Publish Date - 2021-09-13T22:38:39+05:30 IST
దేశంలో ప్రభుత్వ రంగల సంస్థల అమ్మకానికి పెట్టింది పేరు బీజేపీ అని
హుజురాబాద్: దేశంలో ప్రభుత్వ రంగల సంస్థల అమ్మకానికి పెట్టింది పేరు బీజేపీ అని ఆర్థిక శాఖా మంత్రి హరీష్రావు అన్నారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని హరీష్రావు ఆరోపించారు. కాజీపేటకు రావాలసిన కోచ్ ఫ్యాక్టరీని విస్మరించి లాతూర్కు తీసుకెళ్లిందని మంత్రి విమర్శించారు. అమ్మకానికి పెట్టింది పేరు బీజేపీ అని, నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్ఎస్ అని హరీష్రావు పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ అమ్మేస్తున్నారని, అమ్మకాలకే ఓ శాఖ పెట్టిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాలు ఆస్తులను అమ్మొద్దని, క్రియేట్ చేయాలని మంత్రి హరీష్రావు అన్నారు.