వ్యవసాయ మార్కెట్లను కేంద్రం నిర్వీర్యం చేసింది: Harish
ABN , First Publish Date - 2021-12-25T17:47:28+05:30 IST
కేంద్రం వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసిందని మంత్రి హరీష్రావు విమర్శించారు.
సిద్దిపేట: కేంద్రం వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసిందని మంత్రి హరీష్రావు విమర్శించారు. శనివారం సిద్దిపేట మార్కెట్లో వర్మీ కంపోస్టు షెడ్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 4 కోట్ల ప్రజల భవిష్యత్తు, 70 లక్షల రైతుల ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లిన మంత్రులను పనిలేదంటూ కేంద్ర మంత్రులు హేళన చేశారన్నారు. ఆహార భద్రత అంశం కేంద్రం పరిధిలోనిదని తెలిపారు. ధాన్యం విషయంలో కేంద్రం తీరు సరికాదని మంత్రి హరీష్రావు వ్యాఖ్యానించారు.