కాంగ్రెస్ నేతలు పైసలు, సీసాలను నమ్ముకున్నారు: మంత్రి హరీష్రావు
ABN , First Publish Date - 2020-10-30T04:30:01+05:30 IST
కాంగ్రెస్ నేతలు పైసలు, సీసాలను నమ్ముకున్నారు: మంత్రి హరీష్రావు
సిద్దిపేట: కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేవాళ్లని మంత్రి హరీష్రావు అన్నారు. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని హరీష్రావు చెప్పారు. రూ.20 వేల నుంచి లక్ష వరకు వ్యవసాయ రుణాల్ని రద్దుచేస్తున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేశామని, కరోనా వల్ల ఆలస్యమైందని హరీష్రావు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు పైసలు, సీసాలను నమ్ముకున్నారని, టీఆర్ఎస్.. అభివృద్ధిని, సంక్షేమాన్ని నమ్ముకుందని హరీష్రావు అన్నారు.