యాదాద్రి నరసింహుడికి మంత్రి అల్లోల బంగారం వితరణ
ABN , First Publish Date - 2021-11-07T23:31:19+05:30 IST
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్మల్ జీల్లా కేంద్రంలోని ఎన్టీ ఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు.
నిర్మల్: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్మల్ జీల్లా కేంద్రంలోని ఎన్టీ ఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య వేడుక కన్నులపండువగా సాగింది. ఉత్సవమూర్తులను వేదిక వద్ద కొలువుదీర్చారు. అంతకు ముందు స్వామివారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ వేడుకకు నిర్మల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు.బంగారు తాపడం కోసం సీఎం కేసీఆర్ పిలుపునకు మంత్రి అల్లోల స్పందించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కిలో బంగారాన్నినిర్మల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల, పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిదులు భాగస్వామ్యంతో మరో కిలో బంగారాన్ని వితరణగా ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.