యాసంగిలో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయం: మంత్రి జగదీష్రెడ్డి
ABN , First Publish Date - 2021-10-27T01:44:24+05:30 IST
యాసంగిలో వరి పండిస్తే ఒక్క గింజ కూడా కొనుగోలు చేయబోమని మంత్రి
నల్గొండ: యాసంగిలో వరి పండిస్తే ఒక్క గింజ కూడా కొనుగోలు చేయబోమని మంత్రి జగదీష్రెడ్డి స్పష్టం చేసారు. యాసంగిలో వరి ధాన్యం పండించే ఆలోచన రైతులు చేయొద్దని ఆయన హితవు పలికారు. వేరుశనగ, నువ్వులు, పెసళ్లు, ఆవాలు, బొబ్బర్లు ఎంత పండించినా కొనుగోలు చేస్తామని మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు. వరి పంటలకంటే ఈ పంటలకే ఆదాయం వస్తుందని జగదీష్రెడ్డి పేర్కొన్నారు. ప్లీనరీపై కొందరు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని జగదీష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. విజయోత్సవ సభ తర్వాత ఒక్కొక్కరికి పిచ్చి పడుతుందని మంత్రి జగదీష్రెడ్డి పేర్కొన్నారు.