ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు: మంత్రి జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-10-27T22:49:02+05:30 IST

జిల్లాలో వర్షాకాలంలో పండించిన ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నామని

ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు: మంత్రి జగదీష్‌రెడ్డి

యాదాద్రి: జిల్లాలో వర్షాకాలంలో పండించిన ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. యాసంగిలో ఒక వరి గింజను కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. ప్రత్యామ్నాయ పంటలైన నువ్వులు, కుసుమలు, మినుముల, వేరుశనగ వేసుకోవాలని రైతులకు ఆయన సూచించారు. సీఎం చొరవతో వచ్చే యాసంగి కొనుగోలు కూడా ఈ సంవత్సరం కొనుగోలు చేస్తున్నామని కేంద్రం చెప్పిందన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు ఏ రకమైన విత్తనాల కొరత లేకుండా, ప్రభుత్వమే విత్తనాలను సరఫరా  చేస్తుందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-10-27T22:49:02+05:30 IST