ఏపీ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి

ABN , First Publish Date - 2021-07-01T03:25:22+05:30 IST

కృష్ణా నది జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి జగదీష్

ఏపీ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: కృష్ణా నది జలాల వివాదంపై  ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు.విద్యుత్ ఉత్పత్తి కోసమే  శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టారని మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. మమ్మల్ని ఆపే శక్తి, హక్కు ఎవరికీ లేదని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలంలో నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని ఆయన కుండబద్దలు కొట్టారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముమ్మాటికి అక్రమమేనని, దానిని ఆపాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. కుప్పిగంతులు అపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. 


Updated Date - 2021-07-01T03:25:22+05:30 IST