బీజేపీకి యాసంగి ధాన్యం కొనే దమ్ము ఉందా: మంత్రి జగదీష్ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-29T00:58:54+05:30 IST

యాసంగిలో పండిన పంటను కొంటామన్న దమ్ము బీజేపీకి ఉందా అని

బీజేపీకి యాసంగి ధాన్యం కొనే దమ్ము ఉందా: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: యాసంగిలో పండిన పంటను కొంటామన్న దమ్ము బీజేపీకి ఉందా అని కేంద్రాన్ని మంత్రి జగదీష్ రెడ్డి నిలదీసారు. దమ్ము ఉంటే ఎన్ని లక్షల టన్నుల ధాన్యం కొంటారో తేల్చిచెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. ఎన్ని లక్షల టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నామో తెలుపకుండా , ఆ మాట చెప్పకుండా డ్రామాలు వేస్తున్నారని  తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. ఎఫ్‌సీఐ ఇచ్చిన లేఖ తమ దగ్గర ఉందన్నారు. తమది బాధ్యతాయుతమైన ప్రభుత్వమని ఆయన స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వం బాధ్యతగా వ్యహరిస్తుందన్నారు. వానాకాలమే కేంద్రం మోసం చేసే ప్రయత్నం చేసిందని, దానిని రాజకీయంగా తాము వాడుకోలేదని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-29T00:58:54+05:30 IST