ఇక ఆటలు సాగవు: మంత్రి జగదీష్రెడ్డి
ABN , First Publish Date - 2021-07-08T21:45:04+05:30 IST
ఇక ఆటలు సాగవు: మంత్రి జగదీష్రెడ్డి
సూర్యాపేట: సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాయడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మంత్రి జగదీష్రెడ్డి విమర్శించారు. పోతిరెడ్డిపాడు నీటిని అక్రమంగా తోడుకుపోతున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం 203 జీవోను వెనక్కి తీసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలని ఆయన సూచించారు. వరద జలాల పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లను, ఇన్నాళ్లు అక్రమంగా తీసుకుపోయారు.. ఇక ఆటలు సాగవని హెచ్చరించారు. జగన్ ఎన్ని రోజులు లేఖలు రాసినా ఫలితం ఉండదన్నారు.