ప్రజల ఊసురుతోనే కాంగ్రెస్ పార్టీ నాశనం అయింది: జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-01-27T18:06:29+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఊసురుతోనే కాంగ్రెస్ పార్టీ నాశనం అయిందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రజల ఊసురుతోనే కాంగ్రెస్ పార్టీ నాశనం అయింది: జగదీష్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఊసురుతోనే కాంగ్రెస్ పార్టీ నాశనం అయిందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు. అవినీతికి ప్రత్యేక మ్యాప్ వేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రాజక్టుల డిజైన్ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపైన తెలంగాణ ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాదని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్క చుక్క మంచి నీరు కూడా ఇవ్వలేదన్నారు. ఉత్తమ్ తన ఎంత ఎత్తు అవినీతిలో కూరుకుపోయాడన్నారు. జైలుకు వెళ్ళిన చరిత్ర కాంగ్రెస్ మంత్రులకు, నాయకులకు ఉందన్నారు. ఫ్లోరిన్ నుంచి నల్లగొండ జిల్లాను రక్షించిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. ప్రజల కోసం కట్టే ప్రాజక్టులను అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.

Updated Date - 2021-01-27T18:06:29+05:30 IST