ఆ భయం వల్లే వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన: Jagadish

ABN , First Publish Date - 2021-11-19T18:33:47+05:30 IST

సీఎం కేసీఆర్ మహాధర్నా రైతులకు నాయకత్వం వహిస్తుందని ప్రధాని మోడీ నమ్మారని... ఈ సెగ ఢిల్లీ వరకు చేరుతోందనే భయంతోనే రద్దు ప్రకటన చేశారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

ఆ భయం వల్లే వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన: Jagadish

హైదరాబాద్: సీఎం కేసీఆర్ మహాధర్నా రైతులకు నాయకత్వం వహిస్తుందని ప్రధాని మోడీ నమ్మారని... ఈ సెగ ఢిల్లీ వరకు చేరుతోందనే భయంతోనే రద్దు ప్రకటన చేశారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల విజయమన్నారు. కేసీఆర్ నాయకత్వం రైతులకు దొరుకుతుందని భయమే ప్రధాని ప్రకటన అని తాము భావిస్తున్నామని తెలిపారు. రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువు లేకనే ఇన్ని రోజులు సాగిందన్నారు. చట్టాలు ఉపసంహరణ చేసినంత మాత్రాన టీఆర్‌ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు కేసీఆర్ ఉద్యమం చేస్తారని తెలిపారు. విద్యుత్ చట్టాలను మోడీ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకోవాలని మంత్రి జగదీష్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-11-19T18:33:47+05:30 IST