భువనగిరిలో జగదీష్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం

ABN , First Publish Date - 2021-07-26T22:47:03+05:30 IST

భువనగిరిలో జగదీష్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం

భువనగిరిలో జగదీష్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం

భువనగిరి: మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మైకు లాక్కుని స్టేజీపైనే పరస్పర దూషణలు చేసుకున్నారు. చౌటుప్పల్‌లో రేషన్‌కార్డు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. కార్యక్రమం నుంచి ఒక్కసారిగా రాజగోపాల్‌రెడ్డి వెళ్లిపోయారు. స్థానిక ఎమ్మెల్యేకి కనీస సమాచారం లేకుండా నియోజకవర్గానికి ఎలా వస్తారని మంత్రి జగదీష్‌రెడ్డిని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి  ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నానని రాజగోపాల్‌ అన్నారు. 


దీంతో మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి చిల్లర వ్యక్తి అంటూ ఘాటుగా విమర్శించారు. ఏ పూటకు ఏ పార్టీలో ఉంటారో తెలియదని జగదీశ్ ఎద్దేవా చేశారు. పొద్దున్నో మాట, సాయంత్రం మరో మాట మాట్లాడే చిల్లర మనిషి రాజగోపాల్ రెడ్డి అని విమర్శించారు. మునుగోడు నియోజక వర్గంలోని ప్రతి ఊరు తిరుగుతానని, ఎలా అపుతావో చూస్తానంటూ రాజగోపాల్‌కు జగదీష్‌రెడ్డి సవాల్‌ విసిరారు. 



Updated Date - 2021-07-26T22:47:03+05:30 IST