ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ను ఆపలేరు: Jagadish
ABN , First Publish Date - 2021-11-18T18:42:41+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే సీఎం కేసీఆర్కు ముఖ్యమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ను ఆపలేరని స్పష్టం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే సీఎం కేసీఆర్కు ముఖ్యమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ను ఆపలేరని స్పష్టం చేశారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలవి మాయ మాటలని విమర్శించారు. ఈ ఏడేళ్లలో ధర్నా చౌక్లో కూర్చొని ఆందోళన చేస్తామని అనుకోలేదన్నారు. పక్క రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను తమ రాష్ట్రానికి రావాలని అడుగుతున్నారని తెలిపారు. రైతులంతా కేసీఆర్ వెంట ఉన్నారన్నారు. బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారన్నారని మండిపడ్డారు. కేంద్ర నిర్ణయాలు రాష్ట్రాలను కుంగదీస్తున్నాయన్నారు. అందుకే యుద్ధం మొదలు పెట్టాం... ఢిల్లీకి కదిలి వస్తామని మంత్రి జగదీష్ తెలిపారు.