AP: సభలో మంత్రి కన్నబాబు వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం

ABN , First Publish Date - 2021-11-19T17:00:56+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. వ్యవసాయంపై చర్చలో భాగంగా మంత్రి కన్నబాబు హెరిటేజ్ సంస్థను ప్రస్తావనకు తీసుకువచ్చారు.

AP: సభలో మంత్రి కన్నబాబు వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. వ్యవసాయంపై చర్చలో భాగంగా మంత్రి కన్నబాబు హెరిటేజ్ సంస్థను ప్రస్తావనకు తీసుకువచ్చారు. ప్రభుత్వ లోన్లతో గేదెలను కొనుగోలు చేసిన రైతులు....హెరిటేజ్‌కే పాలు విక్రయించాలని గతంలో ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. రైతుల గురించి మాట్లాడితే తనపై పరువు నష్టం కేసు వేశారని కన్నబాబు అన్నారు. అయితే కన్నబాబు వ్యాఖ్యలపై చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  మంత్రి ఆరోపణలపై వివరణకు అవకాశం ఇవ్వాలని టీడీపీ కోరింది. కాగా...మీకు అవకాశం వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోవాలని స్పీకర్ స్పష్టం చేశారు. అలాగే మంత్రి అప్పలరాజు స్పీచ్‌పైనా టీడీపీ అభ్యంతరం తెలిపింది. సంబంధం లేని అంశాలపై మాట్లాడేందుకు మంత్రికి అవకాశం ఎలా ఇస్తారని టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. 

Updated Date - 2021-11-19T17:00:56+05:30 IST