రూ.1,584 కోట్లతో 2,531 బహుళ ప్రయోజిత కేంద్రాలు

ABN , First Publish Date - 2021-06-22T09:14:23+05:30 IST

రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,584 కోట్లతో 2,531 బహుళ ప్రాయోజిత కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు

రూ.1,584 కోట్లతో  2,531 బహుళ ప్రయోజిత కేంద్రాలు

మంత్రి కన్నబాబు 


అమరావతి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,584 కోట్లతో 2,531 బహుళ ప్రాయోజిత కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. సోమవారం విజయవాడ క్యాంప్‌ ఆఫీసులో వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన సమీక్ష నిర్వహించారు. తొలి దశలో రూ.659 కోట్లతో 1,255 కేంద్రాల నిర్మాణాలను నవంబరు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జులై 8న వైఎస్సాఆర్‌ జయంతి సందర్భంగా మొదటి దశ కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, హబ్‌లను, టెస్టింగ్‌ ల్యాబ్‌లు, ఆర్బీకేలకు శాశ్వత భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు.

Updated Date - 2021-06-22T09:14:23+05:30 IST