విశాఖలో పరిపాలన రాజధానికి ప్రజామద్దతు: కన్నబాబు

ABN , First Publish Date - 2021-03-14T23:33:51+05:30 IST

విశాఖలో పరిపాలన రాజధానికి ప్రజామద్దతు లభించిందని మంత్రి కన్నబాబు అన్నారు.

విశాఖలో పరిపాలన రాజధానికి ప్రజామద్దతు: కన్నబాబు

అమరావతి: విశాఖలో పరిపాలన రాజధానికి ప్రజామద్దతు లభించిందని మంత్రి కన్నబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్పష్టం లేని రాజకీయాలను జనసేన నడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి  రోడ్డు మీదకు వచ్చి ఓట్లు అడగకపోయినా ప్రజలు విజయాన్ని అందించారని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీకి తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎంపై రాష్ట్ర ప్రజలకున్న నమ్మకమే ఈ ఫలితాలకు నిదర్శనమన్నారు. జగన్ సత్తా ఏమిటో అందరికీ తెలిసిందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-14T23:33:51+05:30 IST