పిచ్చి చేష్టలను లోకేశ్ మానుకోవాలి: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2021-04-14T23:22:42+05:30 IST

టీడీపీ నాయకుడు నారా లోకేశ్ తిరుపతిలో చేసిన ప్రమాణం, సవాల్ పై మంత్రి కన్నబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ

పిచ్చి చేష్టలను లోకేశ్ మానుకోవాలి: మంత్రి కన్నబాబు

తిరుపతి: టీడీపీ నాయకుడు నారా లోకేశ్ తిరుపతిలో చేసిన ప్రమాణం, సవాల్ పై మంత్రి కన్నబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుర్ర తక్కువ మాటలు, పిచ్చి చేష్టలను లోకేశ్ మానుకోవాలని మంత్రి కన్నబాబు సూచించారు. తమరు ప్రమాణం చేయాల్సి వస్తే.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవలేదు అని తమరు ప్రమాణం చేయాలని కన్నబాబు ఎద్దేవా చేశారు. తనకు పిల్లను ఇచ్చిన మామ ఇంట్లో కాల్పులు జరుగలేదని, ఎవరినీ రక్తసిక్తం చేయలేదని అని తమరు ప్రమాణం చేయాలని కన్నబాబు ప్రశ్నించారు.


 గోదావరి పుష్కరాల మరణాలకు తన తండ్రి చంద్రబాబు కారణం కాదని ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు. తమరిని మాస్ హీరోగా చూపించాలని శిక్షణ ఇస్తున్నట్టు ఉన్నారని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. జగన్ సోదరీమణుల గురించి మాట్లాడుతున్నారు.. తమరికి సంస్కారం ఉందా అని ఆయన ప్రశ్నించారు. తాడిపల్లెలోని జగన్ ఇంటికి రండి.. అది ప్యాలెసా, మామూలు ఇల్లో చూడాలని లోకేష్‌కు ఆయన సవాల్ విసిరారు. అలాగే తమరికి ఇంటికి వస్తాం. అది ప్యాలెస్సా, మామూలు ఇల్లా చూద్దామని నారా లోకేశ్ మంత్రి కన్నబాబు సవాల్ విసిరారు. 

Updated Date - 2021-04-14T23:22:42+05:30 IST