రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి

ABN , First Publish Date - 2021-07-24T03:04:02+05:30 IST

రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి చేయనున్నామని మంత్రి

రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి

అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి చేయనున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. విత్తన నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారని కన్నబాబు పేర్కొన్నారు. విత్తనాలు పండించే రైతులు, కంపెనీల వివరాలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. విత్తనాలు పండించే ప్రతి ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని ఆయన ప్రకటించారు. హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. 

Updated Date - 2021-07-24T03:04:02+05:30 IST