అందువల్లే వివేకా హంతకులను పట్టుకోలేకపోతున్నాం: కొడాలి

ABN , First Publish Date - 2021-04-13T09:14:51+05:30 IST

చిత్తూరు జిల్లా సత్యవేడులో సోమవారం వైసీపీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు...

అందువల్లే వివేకా హంతకులను పట్టుకోలేకపోతున్నాం: కొడాలి

వివేకా హత్య ఆధారాలను చెరిపేశారు


సత్యవేడు, ఏప్రిల్‌ 12: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఆధారాలను చెరిపేశారు. అందువల్లే హంతకులను పట్టుకోలేకపోతున్నాం. హత్య జరిగిన మూడు నెలల వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అప్పుడు హంతకులను పట్టుకోకుండా ఇప్పుడు జగన్‌పై నిందలు వేస్తున్నారు’’ అని మంత్రి కొడాలి నాని అన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడులో సోమవారం వైసీపీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తమ అభ్యర్థి గురుమూర్తికి రాజకీయ అనుభవం లేదని చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. రాజకీయాలలో సేవాభవం ఉన్న కొత్తతరం రావాలన్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని ఉద్దేశించి ఆయన శైలిలో వ్యాఖ్యానించారు. సమస్య అంటే చటుక్కున లేచి పరిగెత్తేలా బాడీ ఫిజిక్‌ ఉండాలి. కానీ బౌన్స్‌ వచ్చిన వాళ్లని రాజకీయాల్లో పెట్టుకుని ఏమి చేస్తాం’’ అంటూ హావభావాలతో వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-04-13T09:14:51+05:30 IST