రైతుల ఇబ్బందులపై అధికారులు దృష్టి సారించాలి: మంత్రి కొడాలి నాని
ABN , First Publish Date - 2021-06-23T00:20:45+05:30 IST
రైతులు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని అధికారులను మంత్రి కొడాలి నాని
అమరావతి: రైతులు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని అధికారులను మంత్రి కొడాలి నాని ఆదేశించారు. విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ సాగు సమయం దగ్గర పడుతుండటంతో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలన్నారు. గతంలో ఎదురైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అవి పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు మంత్రి కొడాలి సూచించారు. సాగు ప్రారంభంలో రైతులకు మందులు, విత్తనాలు, నీటి కొరత లేకుండా చూడాలని అధికారులను కొడాలి నాని ఆదేశించారు.