గన్నీ బ్యాగుల కొరత లేదు: మంత్రి కొప్పుల ఈశ్వర్
ABN , First Publish Date - 2020-04-10T13:50:14+05:30 IST
జగిత్యాల: తెలంగాణలో గన్నీ బ్యాగుల కొరత నెలకొందని.. వరి ధాన్యాన్ని తరలించేందుకు 20 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని పౌర సరఫరాల శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే.
జగిత్యాల: తెలంగాణలో గన్నీ బ్యాగుల కొరత నెలకొందని.. వరి ధాన్యాన్ని తరలించేందుకు 20 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని పౌర సరఫరాల శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. గన్నీ బ్యాగుల కొరత లేదని.. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. అందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సంయమనం పాటిస్తే అందరం బయటపడతామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.