చంచల్గూడలో 288 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2021-08-28T16:40:31+05:30 IST
నగరంలోని చంచల్గూడ సమీపంలో పిల్లి గుడిసెలలో జీహెచ్ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు.
హైదరాబాద్: నగరంలోని చంచల్గూడ సమీపంలో పిల్లి గుడిసెలలో జీహెచ్ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమ్మద్ ఆలీ, ఎంపీ అసద్, మలక్పేట్ ఎమ్మెల్యే బలాల, మంత్రులు తలసాని, ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా రావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా పాల్గొన్నారు. హైదరాబాద్ను స్లమ్ ఫ్రీ సిటీగా చేసేందుకు గతంలో మురికివాడగా ఉన్న పిల్లి గుడిసెలు బస్తీలో రూ.24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను జీహెచ్ఎంసీ నిర్మించింది.