కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక ఆహ్వానం!

ABN , First Publish Date - 2020-09-26T09:34:17+05:30 IST

కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రత్యేక విమానంలో వచ్చారు. బీజేపీ వర్గాలు

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక ఆహ్వానం!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రత్యేక విమానంలో వచ్చారు. బీజేపీ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. కిషన్‌రెడ్డి శుక్రవారం నాటి షెడ్యూల్‌లో ఈ కార్యక్రమం లేదు. మంత్రి కేటీఆర్‌ ఒకటికి రెండుసార్లు కిషన్‌రెడ్డికి  ఫోన్‌ చేసినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. దీంతో, సాయంత్రం 5 గంటలకు బేగంపేటకు ప్రత్యేక విమానంలో వచ్చిన కిషన్‌రెడ్డి, నేరుగా కేబుల్‌బ్రిడ్జి ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. 


కేటీఆర్‌ దగ్గర ఉండి మరీ పనుల వివరాలు కిషన్‌రెడ్డికి వివరించడం బీజేపీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కేవలం బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకే వచ్చిన కిషన్‌రెడ్డి, శనివారం ఉదయమే ఢిల్లీ వెళ్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2020-09-26T09:34:17+05:30 IST