విద్య, వైద్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ: KTR

ABN , First Publish Date - 2021-11-09T19:47:14+05:30 IST

విద్యా, వైద్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.

విద్య, వైద్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ: KTR

కామారెడ్డి: విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. వీటిని బాగు చెసుకుంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగ నిలుస్తుందని తెలిపారు. మంగళవారం బీబీపేటలో 6.50 కోట్ల విరాళాలతో దాతలు ఆధునీకరణ చేసిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా బీబీపేట్ పాఠశాల ఆధునీకరించబడిందన్నారు. కోట్ల రూపాయలతో ఇంత చక్కటి పాఠశాలని నిర్మించిన సుభాష్ రెడ్డి కుటుంబ సభ్యులకి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. దశబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

Updated Date - 2021-11-09T19:47:14+05:30 IST