కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండేకు మంత్రి కేటీఆర్ లేఖ
ABN , First Publish Date - 2021-08-06T00:10:38+05:30 IST
కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండేకు మంత్రి కేటీఆర్ లేఖ
హైదరాబాద్: ఆదిలాబాద్లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ను పునరుద్ధరించాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. మూతపడిన సీసీఐని తిరిగి ఏర్పాటు చేసేలా చూడాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకి లేఖ రాశారు. గతంలో పలుమార్లు ఈ అంశంపై కేంద్రానికి తెలిపినా స్పందించలేదని లేఖలో పేర్కొన్నారు. 1996లో నిధుల లేమీతో మూతపడిన ప్లాంట్ను తిరిగి ఓపెన్ చేయడం వల్ల మరట్వాడ , విదర్భ , ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో సిమెంట్ కొరత తీరుతుదని కేటీఆర్ తెలిపారు.