హైదరాబాద్‌ నగర రోడ్లపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2020-07-10T01:05:03+05:30 IST

హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న రోడ్ల నిర్మాణం, విస్తరణపై పురపాలక శాఖ మంత్రి తారక రామారావు గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

హైదరాబాద్‌ నగర రోడ్లపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న రోడ్ల నిర్మాణం, విస్తరణపై పురపాలక శాఖ మంత్రి తారక రామారావు గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ రోడ్ల నిర్వహణ, భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి... మైక్రో ప్లానింగ్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించుకొని... ఈ మేరకు నివేదిక తయారు చేయాలని కేటీఆర్ సూచించారు. నెలరోజుల్లో నివేదిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అవసరాలతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్‌కి అనుగుణంగా రోడ్ల విస్తరణ మరియు రోడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కావాల్సిన మైక్రో ప్లానింగ్‌పైన దృష్టిసారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు.

Updated Date - 2020-07-10T01:05:03+05:30 IST