పరిశ్రమల శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష

ABN , First Publish Date - 2021-08-06T01:13:10+05:30 IST

రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటే కోసం పరిశ్రమల శాఖపై మంత్రి కేటీఆర్

పరిశ్రమల శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటు కోసం పరిశ్రమల శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపైన సమీక్ష జరిపారు. పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు, అవసరమైన చర్యలను సిద్ధం చేసేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పనిచేయాలని పరిశ్రమల శాఖ అధికారులకు కేటీఆర్ సూచించారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను నగరం బయటకు తరలించేలా జరుగుతున్న ప్రయత్నాలపై  వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి గత ఏడు సంవత్సరాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో నూతన పరిశ్రమల్లో తెలంగాణ స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల పైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. 

Updated Date - 2021-08-06T01:13:10+05:30 IST