బీజేపీ కార్పొరేటర్లు రౌడీల్లా వ్యవహరించారు: కేటీఆర్
ABN , First Publish Date - 2021-11-24T20:35:38+05:30 IST
జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రవంగా స్పందించారు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రవంగా స్పందించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ కార్పొరేటర్లు రౌడీలు, గుండాల్లా వ్యవహరించారని ఆరోపించారు.తీరు గర్హనీయమని అన్నారు. గాడ్సే భక్తులు గాంధీ మార్గాన్ని అనుసరిస్తారని ఎలా అనుకుంటారని ట్వీట్టర్ ద్వారా విమర్శించారు. ఈ ఘటనపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.