సీజేఐని కలిసిన మంత్రి మల్లారెడ్డి

ABN , First Publish Date - 2021-06-18T04:35:21+05:30 IST

నగరంలోని రాజ్‌భవన్‌లో బసచేసిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

సీజేఐని కలిసిన మంత్రి మల్లారెడ్డి
ఎన్వీ రమణకు పుష్పగుచ్చం అందిస్తున్న మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి

మేడ్చల్‌ : నగరంలోని రాజ్‌భవన్‌లో బసచేసిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను గురువారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, బోడుప్పల్‌ మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి ఉన్నారు. అనంతరం రాజశేఖర్‌రెడ్డి జన్మదినం సంద ర్భంగా మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, మజ్లీస్‌ అధినేత ఓవైసీలను మర్యాదపూర్వకంగా కలిశారు. 



Updated Date - 2021-06-18T04:35:21+05:30 IST