పేకాట కేసులో మంత్రి మల్లారెడ్డి తమ్ముడు నరసింహ రెడ్డి?
ABN , First Publish Date - 2021-06-17T02:35:46+05:30 IST
బోయినపల్లి పీస్ పరిధిలోని పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మానుష్య
హైదరాబాద్: బోయినపల్లి పీస్ పరిధిలోని పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మానుష్య ప్రదేశంలో పేకాట ఆడుతున్న 10 మందిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసారు. తదుపరి దర్యాప్తు కోసం బోయిన్పల్లి పోలీసులకు అప్పగించారు. బోయినపల్లి పేకాట కేసులో మంత్రి మల్లారెడ్డి తమ్ముడు నరసింహ రెడ్డి ఉన్నారు. నరసింహ రెడ్డి పేరును FiRలో పోలీసులు చేర్చారు. పేకాట ఆడుతున్న ఘటన స్థలంలోనే టాస్క్ ఫోర్స్ పోలుసులకు మంత్రి తమ్ముడు దొరికాడు. తదుపరి విచారణ కోసం బోయిన్పల్లి పోలీసులకు నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అప్పగించారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.