చైనా అలా చేయడం వల్లే ప్రపంచానికి చేటైంది: మేకపాటి

ABN , First Publish Date - 2020-03-30T18:22:23+05:30 IST

సోమవారం నాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి...

చైనా అలా చేయడం వల్లే ప్రపంచానికి చేటైంది: మేకపాటి

నెల్లూరు: చైనా దేశం కరోనాకి సంబంధించిన వాస్తవాలని మొదట్లో దాచిపెట్టడం ప్రపంచానికి చేటైందని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి... ఏపీలో కరోనా సెకండ్ స్టేజీలో ఉందన్నారు. థార్డ్ స్టేజీకి వెళ్లినా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. ప్రజలు కొందరు మానసిక స్థైర్యం కోల్పోయే ప్రమాదం ఉన్నందున, అటువంటి వారిని కూడా ట్రాక్ చేస్తున్నామన్నారు. 


రాష్ట్రంలోకి అనుమతివ్వం!

ధాన్యం, ఇతర పంటలని కొనుగోలు చేయమని కలెక్టర్లని గతంలో ఆదేశించడం జరిగింది. ప్రస్తుత నేపథ్యంలో రైతులకి నష్టం రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. నిత్యవసర సరుకులు కోసం ఒక్కసారిగా ప్రజలు బయటకి రాకుండా డోర్ డెలవరీ సౌకర్యం కల్పించాం. రాష్ట్రంలో నిత్యవసరాలకి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజలు కూడా సహకరించాలి. ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకి వెళ్లిన వారిని రాష్ట్రంలోకి అనుమతివ్వం. ఇతర రాష్ట్రాల వారు ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకి వెళ్లేందుకు అనుమతివ్వం. అలాంటి వారికి సౌకర్యాలు కల్పిస్తున్నాం. లాక్ డౌన్ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది, జర్నలిస్టులకి సేఫ్టీ కిట్స్ అందిస్తాం. నెల్లూరు జిల్లాకే పది వేలు కిట్‌లు వస్తాయి అని ఏబీఎన్‌కు మంత్రి గౌతమ్ రెడ్డి వివరించారు.

Updated Date - 2020-03-30T18:22:23+05:30 IST