Delhi చేరుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
ABN , First Publish Date - 2021-11-11T17:22:14+05:30 IST
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు.
న్యూఢిల్లీ: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ని మంత్రి గౌతమ్ కలువనున్నారు. మధ్యాహ్నం మరో కేంద్ర ఆరోగ్య, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసే అవకాశం ఉంది. మంత్రి మేకపాటి వెంట ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్, మెడ్ టెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, తదితరులు ఉన్నారు.