రెండో రోజు మంత్రి మేకపాటి గౌతమ్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్
ABN , First Publish Date - 2021-11-12T14:27:32+05:30 IST
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీ గడపనున్నారు.
న్యూఢిల్లీ: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీ గడపనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ట్రాన్స్ పోర్ట్ భవన్లో కేంద్ర పోర్టులు, ఓడరేవుల శాఖ మంత్రి సరబనాథ్ సోనోవల్తో మంత్రి మేకపాటి భేటీ కానున్నారు. 3.30గంటలకు శ్రామ్ శక్తి భవన్లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్తో సమావేశం అవుతారు. సాయంత్రం 5 గంటలకు వల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండెని మంత్రి కలవనున్నారు. పోర్టులు, విద్యుత్ సంబంధించిన పరిశ్రమలు, ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులను మంత్రి గౌతమ్ రెడ్డి కోరనున్నారు.