కొనసాగుతున్న రైతుబంధు నిధుల పంపిణీ

ABN , First Publish Date - 2021-06-18T00:35:00+05:30 IST

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుబంధు నిధుల పంపిణీ కొనసాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

కొనసాగుతున్న రైతుబంధు నిధుల పంపిణీ

హైదరాబాద్: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుబంధు నిధుల పంపిణీ కొనసాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన చేస్తూ శుక్రవారం 7.05 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1153.50 కోట్లు జమ కానున్నాయని తెలిపారు. మూడు రోజులలో 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను రూ.2942.27 కోట్లు జమ చేశామని చెప్పారు. నాలుగో రోజూ నల్లగొండకే అత్యధికం 53,381 మంది రైతులకు 1,82,542 ఎకరాలకు గాను రూ.91.27 కోట్లు పంపిణీ చేసినట్టు మంత్రి వెల్లడించారు. కాగా అత్యల్పం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2300 మంది రైతులకు గాను 7212 ఎకరాలకు 36.05 లక్షలు చెల్లించామన్నారు.మొత్తం నాలుగు రోజులలో రైతుబంధు కింద రైతుల ఖాతాలలో రూ.4095.77 కోట్లు జమ కానున్నాయని అన్నారు.


కరోనా విపత్తులోనూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది వ్యవసాయరంగమేనని ఆయన అన్నారు.60 శాతం మంది ప్రత్యక్ష్యంగా, మరో 20 శాతం మంది పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగం బాగుండాలని ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగానికి చేయూత నిస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు, రైతు భీమా, ఉచిత కరంటు సరఫరాతో పాటు వంద శాతం పంటల కొనుగోళ్లతో రైతులకు అండగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని తెలిపారు.అందుకే కరోనా విపత్తులోనూ గత వానాకాలం, మొన్న యాసంగిలో కలిపి రూ. 14656.02 కోట్లు , ఈ వానాకాలంలో రూ.7508.78 కోట్లు పంపిణీ జరుగుతుందని మంత్రి తెలిపారు. తెలంగాణలో రైతుబంధు, ఉచితకరంటు , రైతుభీమా పథకాలతో సాగు దశ - దిశ మారిందని మంత్రి నిరంజన్ అన్నారు. 

Updated Date - 2021-06-18T00:35:00+05:30 IST