కేంద్రం మడత పెట్టి మాట్లాడుతోంది: Niranjan reddy
ABN , First Publish Date - 2021-11-18T21:54:05+05:30 IST
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మడత పెట్టి మాట్లాడుతోందని
హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మడత పెట్టి మాట్లాడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిపై గవర్నర్కు మెమోరాండమ్ ఇచ్చామన్నారు. ధర్నాలో ముఖ్యమంత్రి చెప్పిన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కేంద్రం వడ్ల కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ సీజన్కు సరిపోయే లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. యాసంగిలో వడ్లు పండేది తెలంగాణలోనే ఎక్కువన్నారు. యసంగిలో బాయిల్డ్ రైస్కు ఉపయోగ పడే వడ్లు మాత్రమే పండుతాయన్నారు. రైతులకు ఈ విషయం స్పష్టంగా చెప్పాలన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం అస్పష్ట వైఖరిని అవలంభిస్తోందన్నారు.