రైతాంగానికి నూతన వేరుశనగ వంగడాలు
ABN , First Publish Date - 2020-08-04T21:18:57+05:30 IST
వ్యవసాయ పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ నూతనంగా అభివృద్ధి చేసిన వేరుశనగ వండాల పై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మంగళవారం మినిస్టర్క్వార్టర్స్లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: వ్యవసాయ పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ నూతనంగా అభివృద్ధి చేసిన వేరుశనగ వండాల పై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మంగళవారం మినిస్టర్క్వార్టర్స్లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరకం వంగడాలపై ఆసక్తి చూపిస్తున్న ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆహార సంస్థలైన మార్స్, మాండెలిజ్ ఈ ఉత్పత్తులు సేకరించే విధంగా ఒప్పందానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక్రిసాట్ , ఐసీఎఆర్ (భారతజాతీయ వ్యవసాయపరిశోధనామండలి) సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ వండగడాలు ఉత్పత్తిచేసినట్టు తెలిపారు. 80శాతం ఓలిక్యాసిడ్ ఉండే గిరినార్ 4, గిరినార్5 వంగడాలను మంత్రి విడుదల చేశారు. రాబోయే యంసంగికి అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు.
సాధారణ వేరుశనగ రకాలలో ఓలిక్యాసిడ్ 40శాతం మాత్రమే ఉంటుందని, దిగుబడి కూడా సాధారణ రకాలకన్నా 30శాతం అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వివరించారు. సాధారణ రకాల్లో 40 నుంచి 50శాతం నూనె ఉంటే ఈ రకంలో 53శాతం ఉంటుందన్నారు. ప్రతి 115 రోజులకు పంట చేతికి వస్తుందన్నారు. ఆలివ్ ఆయిల్లో ఉండే నాణ్యత కలిగినవి ఈ నూతన వంగడాలని చెప్పారు. సుదీర్ఘ కాలం మన్నిక కలిగి ఆహార శుద్ది పరిశ్రమలకు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. వినియోగ దారలుకు ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగంతో పాటు బహిరంగ మార్కెట్లో రైతులకు అధిక ధర వస్తుందని తెలిపారు.
ఈ రకాలను తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా పెద్దయెత్తున రైతాంగం ద్వారా విత్తనాభివృద్ధి సంస్థ సహకారంతో విత్తనోత్పత్తి చేయించాలని ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు కోరారు. ఈసందర్భంగా నూతన వంగడాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్రెడ్డి, ఇక్రిసాట్ ఆసియా రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ పూరన్ ఎం గౌర్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండి కేశవులు, ఇక్రిసాట్ ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ జనీలా, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్తదితరులు పాల్గొన్నారు.