ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2021-01-19T06:34:42+05:30 IST
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
గొల్లపూడి, జనవరి 18: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో సోమవారం 3,539 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను ఆయన మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ నందిగం సురేష్లతో కలిసి అందజేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సీఎం జగన్ ఏడాదిన్నరలో సంక్షేమ పథకాల ద్వారా రూ.93 వేల కోట్లను నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారన్నారు. ఎమ్మెల్యేలు జోగి రమేష్, పార్థసారధి, సామినేని ఉదయభాను, మొండితోక జగన్హోహన్రావు, కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీలత పాల్గొన్నారు.